తమిళనాడు తిరుచిరాపల్లిలో బోరుబావిలో పడ్డ బాలుడ్ని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సుజీత్ను సురక్షితంగా బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక, బాలుడు క్షేమంగా రావాలంటూ తమిళనాట ప్రజలు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ ఘటనపై ట్విటర్ వేదికగా స్పందించిన ప్రధానమంత్రి మోదీ.. 'సుజిత్ను రక్షించేందుకు చేపట్టిన సహాయకచర్యలసై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడాను. అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్పార్థిస్తున్నానని అన్నారు.
My prayers are with the young and brave Sujith Wilson. Spoke to CM @EPSTamilNadu regarding the rescue efforts underway to save Sujith. Every effort is being made to ensure that he is safe. @CMOTamilNadu
— Narendra Modi (@narendramodi) October 28, 2019