చిన్నారి సుజిత్‌ కోసం ప్రధాని ప్రార్థన

Update: 2019-10-28 11:44 GMT

తమిళనాడు తిరుచిరాపల్లిలో బోరుబావిలో పడ్డ బాలుడ్ని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సుజీత్‌ను సురక్షితంగా బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక, బాలుడు క్షేమంగా రావాలంటూ తమిళనాట ప్రజలు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ప్రధానమంత్రి మోదీ.. 'సుజిత్‌ను రక్షించేందుకు చేపట్టిన సహాయకచర్యలసై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడాను. అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్పార్థిస్తున్నానని అన్నారు.



Tags:    

Similar News