భారత్, నేపాల్ మధ్య తొలి ఆయిల్ పైప్ లైన్ ప్రారంభమైంది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయిల్ పైప్ లైన్ ను ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. ఈ ఆయిల్ పైప్ లైన్ తో భారత్, నేపాల్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని ప్రధాని మోడీ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ఈ పైప్లైన్ ఒక చిహ్నమని మోడీ ట్విటర్లో పేర్కొన్నారు.