PM Modi: మన్మోహన్ సేవలు చిరస్మరణీయం.. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి
PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై ప్రశంసలు
PM Modi: పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రిగా, ప్రతిపక్ష నేతగా మన్మోహన్సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. సుదీర్ఘకాలం పాటు ఆయన దేశానికి చేసిన మార్గదర్శకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు మోడీ. ఓసారి పార్లమెంటరీ కమిటీ సభ్యుల ఎన్నికల సందర్భంగా ఆయన వీల్ఛైర్లో వచ్చి మరీ ఓటు వేశారని గుర్తు చేశారు. ఆయన నిబద్ధతకు నిదర్శనమని ప్రధాని మోడీ కొనియాడారు.