పండగకి పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు...

Update: 2019-09-28 10:50 GMT

దసరా పండుగ సందర్భంగా రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను రైల్వే అధికారులు పెంచేసారు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 రూపాయలను ఏకంగా రూ.30 రూపాయలకు పెంచేసారు. ఈ శనివారం నుంచి అక్టోబర్ 10 వరకు ఫ్లాట్ ఫాం టికెట్ ను రూ.30కు విక్రయించనుంది. దసరా సెలవుల రద్దీ దృష్ట్యా పలు రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర తాత్కాలికంగా పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే. పండగ సీజన్ కావడం, రైల్వే స్టేషన్లు అన్ని కిక్కిరిసిపోవడం ఖాయం కావడంతో ప్లాట్ ఫాంపై రద్దీని కొద్దిమేర నియంత్రించవచ్చని భావిస్తున్నారు. 

Tags:    

Similar News