తెలంగాణలో పండిన మొత్తం ధాన్యం కొనలేం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌..

Piyush Goyal: రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తం కొనలేమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు.

Update: 2022-03-23 12:31 GMT

తెలంగాణలో పండిన మొత్తం ధాన్యం కొనలేం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌..

Piyush Goyal: రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తం కొనలేమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలో పండించిన ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లోక్ సభలో స్పష్టం చేశారు.

అస్సాంలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు లోక్‌ సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు కేంద్ర మంత్రి.

Tags:    

Similar News