పార్లమెంట్‌లో పట్టువిడువని విపక్షం.. ఉభయ సభలు వాయిదా

Parliament Monsoon Session: మణిపూర్‌పై చర్చకు విపక్షాల పట్టు

Update: 2023-08-01 06:56 GMT

పార్లమెంట్‌లో పట్టువిడువని విపక్షం.. ఉభయ సభలు వాయిదా

Parliament Monsoon Session: మణిపూర్ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఇవాళ కూడా రాజ్యసభలో విపక్ష ఎంపీలు మణిపూర్‌ అంశంపై ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశారు. నినాదాలతో సభను హోరెత్తించారు. అయితే చర్చకు సమయం కేటాయించామని రాజ్యసభ ఛైర్మన్ చెబుతున్నా.. విపక్ష ఎంపీలు పట్టు వీడలేదు. దీంతో ఎంపీల తీరుపై ఛైర్మన్‌ ధన్‌కడ్‌ మండిపడ్డారు. అయినా విపక్ష ఎంపీలు నిరసనలు కొనసాగించడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

Tags:    

Similar News