ఓట్ చోరీ ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై లోక్సభ, రాజ్యసభలో గందరగోళం
పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం రాహూల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ ప్రధాని గౌరవాన్ని కించపరిదే విధంగా వ్యాఖ్యలు చేశారు ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శలు
ఓట్ చోరీ ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై లోక్సభ, రాజ్యసభలో గందరగోళం
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం లేపాయి. కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని గౌరవాన్ని కించపరిచే విధంగా., హింసను ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశ ప్రజలకు, పార్లమెంట్ కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమ్రశించారు. సభ్యుల నినాదలతో లోక్ సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది.