మోదీని కాదని.. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పాక్ ఆహ్వానం !

పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం పంపనుంది.

Update: 2019-09-30 12:35 GMT

పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం పంపానుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునట్లుగా ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. పాకిస్థాన్‌ కర్తార్‌పూర్‌లో దర్బార్‌ సాహెబ్‌ గురుద్వార్, భారత దేశంలోని డేరా బాబా నానక్‌ గురుద్వారాలను కలుపుకొని ప్రత్యేక కారిడార్‌ను భారత్‌,పాక్‌ నిర్మిస్తుంది. ప్రస్తుత భారత ప్రధాని మోదీని కాదని ఈ నిర్ణయం తీసుకోవడంపై వివాదాస్పదమైంది. అయితే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పాకిస్థాన్ కు ఎంతో ప్రతిష్టాత్మకం కూడా. అధికారికంగా ఆహ్వాన పత్రిక అందజేస్తామని ఖురేషీ తెలిపారు. నవంబర్ 9, 2019న కారిడార్‌ను ప్రారంభించాలని పాక్ నిర్ణయించుకుంది. 

Tags:    

Similar News