Pulwama Encounter: పుల్వామా ఉగ్రవాద కాల్పుల్లో ఆర్మీ జవాన్ మృతి

Update: 2021-07-02 06:43 GMT

పుల్వామా ఉగ్రవాద దాడి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Pulwama Encounter: పుల్వామా జిల్లాలోని రాజ్ పోరా ప్రాంత సమీపంలో ఉన్న హంజిన్ గ్రామంలో శుక్రవారం ఉదయం కొంతమంది ఉగ్రవాదులు తలదాచుకున్నరనే సమాచారంతో భద్రత దళాలు ఆ ప్రాంతంలో కర్దన్ సెర్చ్ ఆపరేషన్ ని నిర్వహించారు. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రత దళాలపై కాల్పులు ప్రారంభించడంతో వెంటనే అలెర్ట్ అయిన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఒక ఆర్మీ జవాన్ గాయపడడంతో కాశ్మీర్ లోని ఒక ఆసుపత్రిలో చేర్పించిన కాసేపటికే ఆ జవాన్ మృతి చెందినట్లు ఒక సమాచారం. 2019 ఫిబ్రవరి 14 టెర్రరిస్ట్ ఘటన మరువక ముందే పుల్వామా ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం భాధకరము. ఇప్పటికే పుల్వామా ప్రాంతానికి భారీగా చేరుకున్న ఆ ప్రాంత పోలీసులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) లతో సహా సంయుక్త భద్రతా దళాలు అణువనువు గాలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News