సుప్రీంకోర్టులో నిర్భయ కేసు మరోసారి వాయిదా పడింది. నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ ట్రయల్ కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం పిటిషన్పై విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.... వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం వాదనపై అభిప్రాయం చెప్పాలంటూ దోషులకు సూచించింది.