Mumbai: ముంబైలో 26/11 తరహా దాడులు చేస్తాం.. ముంబై పోలీసుల‌కు బెదిరింపు మెసేజ్‌..

Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

Update: 2022-08-20 10:48 GMT

Mumbai: ముంబైలో 26/11 తరహా దాడులు చేస్తాం.. ముంబై పోలీసుల‌కు బెదిరింపు మెసేజ్‌..

Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. 26/11 ఉగ్రదాడి తరహాలో ముంబైపై విరుచుకుపడతామని సందేశం పంపారు. పాకిస్థాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ నుంచి ఈ బెదిరింపు మెసెజ్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. భారతదేశంలో విధ్వంసం సృష్టించే పనిలో ఆరుగురు వ్యక్తులు నిమగ్నమై ఉన్నారని కూడా ఆ మెసెజ్‌లో ఉంది.

ఈ వ్య‌వ‌హారంపై ముంబై పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. బెదిరింపు మెసేజ్‌పై ఇత‌ర ఏజెన్సీల‌నూ అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. మ‌హారాష్ట్ర‌లోని రాయ్‌గ‌ఢ్ తీరంలో గురువారం బోటులో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్స్ ప‌ట్టుబ‌డిన నేప‌ధ్యంలో బెదిరింపు మెసేజ్ రావ‌డం ప్రాధాన్య‌త సంతరించుకుంది.

Tags:    

Similar News