Mulayam Singh Yadav: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

Mulayam Singh Yadav: ఆగస్టు 22 నుంచి ఆస్పత్రిలో ములాయంసింగ్‌కు చికిత్స.. గుర్‌గావ్‌ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Update: 2022-10-10 05:05 GMT

Mulayam Singh Yadav: ములాయంసింగ్‌ యాదవ్‌(82) కన్నుమూత

Mulayam Singh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఇవాళ కన్నుమూశారు.

 ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్‌ 22న మూర్తిదేవి- సుఘర్‌సింగ్‌ యాదవ్‌ దంపతులకు ములాయం సింగ్ జన్మించారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్‌ప్రదేశ్​ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యడిగా 10 సార్లు, లోక్‌సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ఉత్తర్‌ప్రదేశ్‌ను ములాయం అభివృద్ధి పథంలో నడిపించారు. యూపీలో అనేక సంస్కరణలను పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు.

Tags:    

Similar News