Varun Gandhi: బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ఆ పార్టీకి షాక్‌

Varun Gandhi: సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు

Update: 2021-09-05 15:00 GMT

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (ఫోటో ది హన్స్ ఇండియా)

Varun Gandhi: బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు వరుణ్ గాంధీ మద్దతు ప్రకటించారు. రైతుల బాధలను కేంద్రం అర్ధం చేసుకోవాలని కోరారు. కిసాన్ పంచాయత్‌లను ఆయన సమర్ధిస్తూ ట్వీట్‌ చేశారు. రైతులతో సంప్రదింపుల ప్రక్రియను కేంద్రం తిరిగి జరపాలని ఆయన సూచించారు. ''లక్షలాది మంది రైతులు ముజఫర్‌నగర్‌లో నిరసనలకు ఇవాళ సమావేశమయ్యారు. రైతులు మన సొంత మనుషులు. గౌరవప్రదంగా వారితో తిరిగి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ముందన్నారు.


Tags:    

Similar News