Rahul Gandhi: మోదీకి.. మణిపూర్​ కన్నా ఇజ్రాయెల్​పైనే ధ్యాస ఎక్కువ!

Rahul Gandhi: మణిపూర్‌ ఎన్నో రోజులు ఒక రాష్ట్రంగా ఉండలేదు.

Update: 2023-10-16 14:02 GMT

Rahul Gandhi: మోదీకి.. మణిపూర్​ కన్నా ఇజ్రాయెల్​పైనే ధ్యాస ఎక్కువ!

Rahul Gandhi: మిజోరాంలో నిర్వహించిన ఎన్నికల సభలో బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ హింస సమస్యను లేవనెత్తుతూ కేంద్రంలోని బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ నాశనం చేసిందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌ ఎన్నో రోజులు ఒక రాష్ట్రంగా ఉండలేదు. రెండు విడిపోతుందన్నారు. మణిపూర్‌లో మహిళలు, చిన్నారుల పై అఘాయిత్యాలు జరుగుతున్న స్పందించని మోడీ ఇజ్రాయల్‌ గురించి మాత్రం స్పందిస్తారని ఆయన విమర్శించారు.

Tags:    

Similar News