అహ్మదాబాద్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోదీ...

Update: 2019-10-02 15:43 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జాతిపితకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గాంధీకి 'వైష్ణవ జన తో' చాలా ఇష్టమైన భజనగీతం అని, ఈ గీతాన్ని 150కి పైగా దేశాల గాయకులు వివిధ భాషల్లో ఆలపించడం మహాత్ముడి స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పారు. భారత్ ఇప్పుడు ప్రపంచశక్తిగా అవతరిస్తోందని, ప్రపంచదేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే ప్రపంచదేశాల్లో భారత్ ప్రతిష్ఠ ఎంతో పెరిగిందని మోదీ చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినం ప్రతిపాదన చేస్తే స్వల్ప వ్యవధిలో ఆమోదం లభించిందని వివరించారు.

Tags:    

Similar News