జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాంలో కొందరు కూలీలను టార్గెట్ చేసి కాల్పులు జరపడంతో అయిదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరణించినవారు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని తెలుస్తోంది. కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టుకోడానికి భద్రతాదళాలు గాలిస్తున్నాయి.. దక్షిణ కశ్మీర్ ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. గత రెండు రోజుల్లో ఇది ఆరో దాడి..