రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన పై బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది . జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. మెహబూబా ముఫ్తీని హరి నివాస్ - వివిఐపి రాష్ట్ర అతిథి గృహానికి తీసుకువెళ్లారు. సిఆర్పిసి సెక్షన్ 144 కింద అధికారులు ఆంక్షలు విధించడంతో ఆమెను నిన్న రాత్రి గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమెను అరెస్టు చేయడానికి కారణం వెంటనే తెలియలేదు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చిన సెక్షన్ 370 ను రద్దు చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా తీర్మానాన్ని ఇరువురు నాయకులు ఖండించారు.