ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్ లో ఓ కెమికల్ ఫ్యాక్టీరీలో అగ్నిప్రమాదం సంభవించింది.

Update: 2020-06-03 12:52 GMT

గుజరాత్ లో ఓ కెమికల్ ఫ్యాక్టీరీలో అగ్నిప్రమాదం సంభవించింది.భరూచ్ జిల్లాలోని దహేజ్ పారిశ్రామక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్‌లో జరిగిన పేలుడు కారణంగా కర్మాగారానికి చెందిన 40 మంది కార్మికులు గాయపడ్డారు. స్థానికులు సమాచారం అందించడంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ఇక గాయపడిన వారందరినీ భరూచ్‌లోని ఆసుపత్రులకు తరలించారు, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని భరూచ్ కలెక్టర్ ఎండి మోడియా అన్నారు. ప్రభావిత కర్మాగారం సమీపంలో ఉన్న లఖి, లువారా గ్రామాల నివాసితులను ముందుజాగ్రత్త చర్యగా తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News