మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ఆర్ధిక పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ హయాంలో దేశ ఆర్ధిక పరిస్థితి తిరోమనం చెందుతుందని తెలిపారు. ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని మోడీ ప్రభుత్వం ముందుగా అంగీకరించాలని సూచించారు. నిపుణులు చెబుతున్న అంశాలను మోడీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన మన్మోహన్ సింగ్...దీనిపై దృష్టి సారించాలనే విషయాన్ని మోడీ ప్రభుత్వం మరిచిందన్నారు.