Mallikarjun Kharge: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వేళ..రాష్ట్రపతి ముర్మును మోడీ అవమానించారన్న ఖర్గే..

Mallikarjun Kharge: ప్రధాని మోడీపై మల్లికార్జున ఖర్గే విమర్శలు

Update: 2023-05-29 07:11 GMT

Mallikarjun Kharge: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వేళ..రాష్ట్రపతి ముర్మును మోడీ అవమానించారన్న ఖర్గే..

Mallikarjun Kharge: ప్రధాని మోడీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిన హక్కును రాష్ట్రపతి నుంచి ప్రధాని లాక్కున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యం కేవలం భవంతులతో నడవదని ఖర్గే తెలిపారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి విపక్ష సభ్యులు రాకపోయినా పర్వాలేదనుకున్నారంటూ మోడీపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని ఆహ్వానించకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించారు. కొత్త భవనం శంకుస్థాపనకు గాని, ప్రారంభోత్సవానికి గానీ ముర్మును ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమన్నారు.

Tags:    

Similar News