ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేతన్ శర్మ(29) అనే ఆర్మీ అధికారి చనిపోయాడు .. అయితే అతను చనిపోయే కొన్ని గంటల ముందు తన ఫోటోను కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశాడు. బహుశా ఇదే నా లాస్ట్ ఫోటో కావొచ్చు అనే ఓ సందేశాన్ని కూడా పంపాడు. అయితే ఈ మెసేజ్ చూసినా కేతన్ శర్మ కుటుంబ సభ్యులు షాక్ కి గురి అయ్యారు . చివరికి అదే నిజం కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే కేతన్ శర్మ అంత్యక్రియల నిమిత్తం అయన మృతదేహాన్ని మీరట్కు తరలించారు. వేలాది మంది ప్రజలు కేతన్కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చారు. కేతన్ చిన్నప్పుడి నుండి ఆర్మీలో చేరాలని కలలు కన్నాడు. అందుకు తగట్టుగానే తన కళను సాకారం చేసుకున్నాడు .కేతన్ శర్మకి భార్య ఏరా, ఓ కూతురు ఉన్నారు. కేతన్ మరణంతో కుటంబం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది ..