మహారాష్ట్రలోని పొలిటికల్ క్రైసిస్పై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వెంటనే ప్రొటెం స్పీకర్ను నియమించాలని. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశించింది. ఆ ఓటింగ్ రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం లేదని, లైవ్ కవరేజీ ద్వారా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.