మధ్యప్రదేశ్లో బలపరీక్ష అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్, స్పీకర్, కమల్నాథ్ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది. వెంటనే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ గవర్నర్, స్పీకర్, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.