భారత్​లో కరోనాతో తొలి డాక్టర్ మరణం నమోదు

Update: 2020-04-09 08:08 GMT

కరోనా వైరస్‌ భారత్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5734కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 166మంది మరణించగా 5095మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో పోరాడి 473మంది కోలుకున్నారు. భారత్‌లో కరోనాతో తొలి డాక్టర్ మరణం నమోదయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా బారినపడి ఓ వైద్యుడు మృతి చెందాడు.

Tags:    

Similar News