తమిళనాడులోని వేలూరు లోక్సభ నియోజకవర్గ ఎన్నిక వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఎన్నికను నిలిపేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వేలూరు నియోజకవర్గంలో ధన ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఎన్నికను నిలిపివేస్తూ వేస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఇటీవల అక్కడ డీఎంకే నేతకు చెందిన సిమెంట్ గోడౌన్లో దాదాపు రూ.10 కోట్ల నగదును ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేశారు. కాగా నియోజకవర్గంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేకపోవడంతో గురువారం అక్కడ జరగాల్సిన ఎన్నికను నిలిపివేత చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. మరో విడతలో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.