Maharashtra: కాసేపట్లో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కీలక ప్రకటన

Maharashtra: మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది.

Update: 2021-04-21 14:47 GMT

Maharashtra: కాసేపట్లో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కీలక ప్రకటన

Maharashtra: మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ, 144 సెక్షన్, వారాంతంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం అదుపులోకి రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం మహారాష్ట్ర సర్కార్‌ అన్వేషిస్తోంది. కరోనా పరిస్థితులపై కేబినెట్‌లో చర్చించగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలుకే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుపై కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం ఉద్దవ్‌ ఠాక్రే. దీంతో సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.

Tags:    

Similar News