పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ చేయలేదా.. అయితే రద్దే..

పాన్‌ కార్డుతో మీ ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకోలేదా? అయితే వెంటనే చేసుకోవాలి.. లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుంది.

Update: 2019-12-28 06:14 GMT

పాన్‌ కార్డుతో మీ ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకోలేదా? అయితే వెంటనే చేసుకోవాలి.. లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుంది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది. పాన్‌తో ఆధార్‌ లింక్‌కు గతంలో చాలా సార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం... ఈసారి డిసెంబర్‌ 31 తరువాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ విషయాన్నీ గమనించాలని పేర్కొంది. మరోవైపు భారతీయ ప్రవాసులు, గమనించండి. ఈ సంవత్సరం చివరి నాటికి మీరు మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు పనిచేయనిదిగా పరిగణించబడుతుంది.

డిసెంబర్ 31 లోపు భారతీయ నివాసి యొక్క పాన్‌ను అతని / ఆమె ఆధార్ కార్డుతో అనుసంధానించమని కోరుతూ పబ్లిక్ నోటీసు జారీ చేసినట్లు గల్ఫ్ న్యూస్ శుక్రవారం తెలిపింది. అక్కడ ఉండే ప్రవాస భారతీయులు తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవాలని లేదంటే లావాదేవీలపై ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. వాస్తవానికి అక్కడ ఒక ప్రవాస భారతీయుడికి (ఎన్‌ఆర్‌ఐ) ఆధార్ కార్డు లేదా పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) అవసరం లేదు, కానీ వాటిని డిసెంబర్ 31 లోగా లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవహారాలతో కూడిన ఒక ఎన్నారై పాన్ కార్డు మరియు ఆధార్ రెండింటినీ కలిగి ఉండాలని సూచించారు.

అనుసంధానానికి గడువు డిసెంబర్ 31 వరకు పొడిగించబడింది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎన్నారైలకు భారతదేశంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే లేదా దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పాన్ కార్డు తప్పనిసరి గా ఉండాలి. కాగా ఆదాయ పన్ను వెబ్‌సైట్‌లో ఆధార్‌, పాన్‌ అనుసంధానం లింక్‌పై క్లిక్‌ చేసి.. ఆ రెండింటి వివరాలు ఇవ్వాల్సి నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోపు రెండింటినీ జతచేయడం చేయకపోతే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏఏ ప్రకారం పాన్‌ కార్డును రద్దు చేస్తారు.

Tags:    

Similar News