Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2021-08-11 11:28 GMT

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా హైవే పై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియల కింద చిక్కుకున్న వాహనాల్లో సుమారు 40 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఘటన స్థలంలో ఆర్మీ, NDRF సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశాయి. కొండపై నుంచి రాళ్లు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Tags:    

Similar News