మరొకొద్ది గంటల్లో బలపరీక్ష, ప్రభుత్వం కూలే అవకాశాలే చాలా ఎక్కువ. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన మాట నిలుపుకొన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగా తొలి విడత రుణమాఫీ చేపట్టారు. ఇక బల పరీక్ష రోజు అంతటి గందరగోళ పరిస్థితుల్లోనూ ఆయన మరో విడత రుణమాఫీని అమలు చేశారు. సీఎంగా కుమారస్వామి ఆఖరి సంతకం అదే కావడం విశేషం.