త్వరలో కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకి గాను ఉపన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఉపఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా బరిలోకి దిగుతామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తెలిపారు.. బీజేపీతో పొత్తు ఉంటుందని వస్తున్న వార్తలను అయన ఖండించారు. అలాంటిది ఏమి లేదని ఒంటరిగానే బరిలోకి దిగనున్నామని తేలిపారు. ఇక ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప ప్రభుత్వంపై అయన నిప్పులు చెరిగారు. పేద ప్రజలకు సహాయం చేయడంలో యెడియూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అప్పటి ప్రభుత్వ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును వేసిన విషయం తెలిసిందే.