నేడు లోక్‌సభలో కీలక బిల్లులు.. తమ ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

Parliament Winter Session: మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేయాలని.. సిఫార్సు చేసిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ

Update: 2023-12-08 04:18 GMT

నేడు లోక్‌సభలో కీలక బిల్లులు.. తమ ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

Parliament Winter Session: ఇవాళ్టి పార్లమెంటు సెషన్‌కు తప్పకుండా హాజరుకావాలంటూ తమ పార్టీ లోక్‌సభ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. నేడు పలు కీలక బిల్లులపై చర్చతో పాటు ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ పార్లమెంటరీ వ్యవహారాల్లో బీజేపీ తీసుకునే వైఖరికి మద్దతుగా నిలిచేందుకుగానూ ఎంపీలంతా లోక్‌సభకు రావాలని పార్టీ అధిష్టానం కోరింది. భారతీయ సాక్ష్య బిల్లు, ఫైనాన్స్ బిల్లు, భారతీయ న్యాయ సంహిత బిల్లులలో కొన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, గురువారం సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News