కేరళలో రోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కేరళ ప్రభుత్వం నిర్వహించే న్యూఇయర్-క్రిస్మస్ లాటరీని ఫిబ్రవరి పదిన డ్రా తీయగా మలూర్ గిరిజన ప్రాంతానికి చెందిన పెరున్నాన్ రాజన్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
బహుమతి మొత్తం 12కోట్లు కాగా, 30శాతం ట్యాక్స్, టికెట్ పర్సంటేజ్ పోనూ 7కోట్ల 20లక్షల రూపాయలు అందనున్నాయని నిర్వాహకులు తెలిపారు. అయితే, 12కోట్ల రూపాయల లాటరీని గెలుచుకోవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని రాజన్ ఉబ్బితబ్బివుతున్నాడు. తనకొచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చేసి తనలాగా బాధల్లో, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తానని అంటున్నాడు.