కాసేపట్లో భారత్ గడ్డపై ట్రంప్ అడుగుపెట్టనున్నారు. కాగా ఢిల్లీలో ట్రంప్తో ఏర్పాటు చేసిన సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ఆహ్వానం అందించారు. వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఆహ్వానం అందడంతో ఆయన కూడా హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశంలో ట్రంప్ కోసం కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్ను అందించనున్నారు. అక్కడ ట్రంప్నకు ఏర్పాటు చేసిన విందులో భాగంగా తెలంగాణ వంటకాలను రుచిచూపించనున్నారు. వాటిలో ట్రంప్కోసం స్పెషల్గా నాటుకోడి పకోడిని తయారు చేపిస్తున్నారట.