నన్ను క్షమించండి: కుమారస్వామి

Update: 2019-07-23 13:31 GMT

ముఖ్యమంత్రి హోదాలో చివరిసారిగా ప్రసంగిస్తున్న కుమారస్వామి ఉద్వేగానికి లోనయ్యారు. బలపరీక్ష ముందు సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన కన్నడ ప్రజలు తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. తన పాలనలో చాలా మంచి పనులు చేశానని అయితే కొన్ని తప్పులు కూడా చేసినట్లు వివరించారు. సీఎం పదవి తనకు అవసరం లేదని సంతోషంగా పదవిని ఇచ్చేందుకు సిద్ధమని కుమారస్వామి వెల్లడించారు. 

Tags:    

Similar News