కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు

Update: 2019-11-13 05:54 GMT

కర్ణాటకలో ఎమ్మెల్యేల అనర్హత వేటపై సుప్రీం తీర్పు చెప్పింది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. కుమార స్వామి బలనిరూపణ సమయంలో విప్ ధిక్కరించిన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆ సమయంలో అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడిన వారిలో 12 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెట్లపైన అనర్హత వేటు పడింది. అయితే ఎమ్మెల్యేలు ఉపఎన్నికలో పోటీ చేసే విషయంలో మాత్రం ఊరట లభించింది. డిసెంబర్ 5న కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

Tags:    

Similar News