బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

Update: 2020-01-20 09:26 GMT
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

2019లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జేపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అప్పటి అధ్యక్షుడు అమిత్ షా నియమించారు. వాస్తవానికి నడ్డా 2019 సంవత్సరం చివరిలోనే పార్టీ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈరోజు వరకు వాయిదా పడింది. ఎట్టకేలకు పార్టీ బాధ్యుడిగా నడ్డాకు పగ్గాలు అప్పగించారు అమిత్ షా. జేపీ నడ్డా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ఎన్నికల ఇంచార్జి రాధామోహన్‌సింగ్‌ నియామకపత్రాన్ని అందించారు.

Tags:    

Similar News