ఢిల్లీలో జేఎన్‌యూ క్యాంపస్‌ వద్ద ఉద్రిక్తత

Update: 2019-11-11 07:42 GMT

ఢిల్లీలోని జేఎన్‌యూలో నిరసనలు వెల్లువెత్తాయి. వర్సిటీ హాస్టల్‌ వసతి, మెస్‌, భద్రత కోసం వసూలు చేస్తున్న ఫీజుల్ని పెంచడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు వర్సిటీ ఎదుట భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. పెంచిన ఫీజుల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వం క్యాంపస్‌లో భారీగా భద్రతా బలగాల్ని మోహరించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఏఐసీటీఈ ఆడిటోరియంవైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా అక్కడి వరకు ర్యాలీ నిర్వహిస్తామని విద్యార్థులు పట్టుబడుతుండడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 

Tags:    

Similar News