కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదు; కుమారస్వామి

Update: 2019-08-04 10:11 GMT

ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న యడియూరప్ప ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదని అన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మరియు జేడీఎస్ నేత కుమారస్వామి .. త్వరలోనే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని అయన వాఖ్యానించారు . అనర్హత వేటుకి గురైన 17 నియజకవర్గాల్లో తిరిగి ఉపఎన్నికలు జరుగుతాయని అందుకు జేడీఎస్ నేతలు సిద్దంగా ఉండాలని కోరారు . అయన మండ్యాలో జేడీఎస్ నిర్వహించిన ఓ సభలో ఈ వాఖ్యలు చేసారు .ఇటివల జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో 99 సీట్లు మాత్రమే సాధించి ఓడిపోయినా సంగతి తెలిసిందే. అనంతరం బీజేపి అధికారంలోకి వచ్చింది . 

Tags:    

Similar News