Twitter CEO: ట్విటర్ సీఈవో జాక్ డోర్సే రాజీనామా

Twitter CEO: ట్విటర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్

Update: 2021-11-30 01:59 GMT

ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన పరాగ్ అగర్వాల్ (ఫైల్ ఇమేజ్)

Twitter CEO: మరో భారతీయుడు దిగ్గజ సంస్థకు అధిపతి కాబోతున్నారు. ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలకు అధినేతలుగా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సీఈవో బాధ్యతలు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించామగ. దీంతో పరాగ్ అగర్వాల్ ఆయన స్థానంలో ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం.

Full View


Tags:    

Similar News