రేపు 9 మంది సుప్రీంకోర్టు జడ్జిల ప్రమాణ స్వీకారం.. కోర్టు చరిత్రలో ఇదే తొలిసారి..

Supreme Court: రేపు సుప్రీంకోర్టులో అపూర్వ ఘటన చోటుచేసుకోనుంది.

Update: 2021-08-30 15:26 GMT

రేపు 9 మంది సుప్రీంకోర్టు జడ్జిల ప్రమాణ స్వీకారం.. కోర్టు చరిత్రలో ఇదే తొలిసారి..

Supreme Court: రేపు సుప్రీంకోర్టులో అపూర్వ ఘటన చోటుచేసుకోనుంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి 9మంది జడ్జిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఆపూర్వ దృష్యాలను దేశ ప్రజలు చూడాలనే ఉద్దేశంతో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయితే 1వ కోర్టు ప్రాంగణం మీద జరగాల్సిన ప్రమాణస్వీకారం కోవిడ్‌ కారణంగా అదనపు భవనం ఆడిటోరియానికి ప్రమాణ స్వీకార వేదికను మార్చారు. జస్టిస్‌ అభయ్ శ్రీనివాస్ ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి, హిమా కోహ్లీ, నాగరత్న, రవికుమార్, సుందరేశ్, మాధుర్య త్రివేది శ్రీ నర్సింహా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

Tags:    

Similar News