కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ కలిశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆమె అమిత్ షాతో భేటీ అయ్యారు. తనను ఏపీ కి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కేడర్కు చెందిన శ్రీలక్ష్మీ ఏపీకి వెళ్లాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఆమె ఏపీ సీఎం జగన్తో కూడా భేటీ అయ్యారు. అమిత్ షా తో పాటు పీఎంవో అధికారులను కూడా శ్రీలక్ష్మీ కలిశారు. ఏపీకి వచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించుకునే పనిలో శ్రీలక్ష్మీ ఉన్నారు.