పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు..

Update: 2019-04-20 02:30 GMT

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో పూర్వా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ప్యాంట్రీ, పవర్ కార్‌తో పాటు మరో 10 ప్రయాణికుల బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న యాక్సిడెంట్ రిలీఫ్ రైలు, వైద్య బృందాలు హుటాహుటిన స్పాట్‌కు చేరాయి. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పూర్వా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 11 రైళ్ల రాకపోకలను రద్దుచేశారు.

Similar News