రాబోయే దశాబ్దం నవభారతం, నవతరానిదే : రాష్ట్రపతి

Update: 2020-01-25 16:22 GMT

రాబోయే దశాబ్దం నవభారతం, నవతరానిదేనన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. రాబోయే తరం సైతం దేశ మౌలిక విలువలకు బలంగా కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కొత్త దశాబ్దంలో న్యూ ఇండియా పురోభివృద్ధితో పాటు సరికొత్త పుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధిలో కొత్తతరం భాగస్వామ్యం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.  

Tags:    

Similar News