ఢిల్లీలోని సఫ్తర్జంగ్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. ఆస్పత్రి ఎదుట ఉన్నావ్ గ్రామస్తుల ఆందోళన
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని సఫ్తర్జంగ్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి ఎదుట ఉన్నావ్ గ్రామస్తుల ఆందోళనకు దిగారు. యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై వివిధ వర్గాల చెందిన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే శిక్షించాలని మహిళలు ధర్నా చేపట్టారు.