కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. మహిళా మంత్రి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుండటం ఇదే మొదటిసారి. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్కు కొనసాగింపుగా ఈ బడ్జెట్ను ఉండనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్కు సంబంధించిన డాక్యుమెంట్ల ప్రింటింగ్ను ఈరోజు నుంచి ప్రారంభించింది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఇవాళ హల్వా వేడుకలను నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. బడ్జెట్ పత్రాలు ముద్రించడానికి ముందు హల్వా వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ.