గుజరాత్ లోని కచ్ సముద్రతీరంలో హై అలర్ట్ ప్రకటించారు. భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ లో శిక్షణ పొందిన టెర్రరిస్టులు కచ్ తీర ప్రాంతం నుంచి భారత్ భూభాగంలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఇచ్చాయి. దీంతో కచ్ సముద్ర ప్రాంతంలో ఎన్ ఐఏ బృందాలు విస్త్రత తనిఖీలు చేస్తున్నాయి.