ఎన్సీపీకి రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి

మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)కి రాజీనామా చేశారు.

Update: 2020-06-22 13:38 GMT

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)కి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇటీవల, శంకర్ సింగ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఎన్సీపీ జయంత్ పటేల్ ను రాష్ట్ర అధిపతిగా నియమించింది. శంకర్ సింగ్ వాఘేలా తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు 5 సార్లు పార్టీలను మారారు. 2017 నుండి 2020 కి మూడుసార్లు మారారు.

శంకర్ సింగ్ మొదట బిజెపి (జన సంఘ్) లో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి కేంద్రంలో వస్త్ర శాఖ మంత్రి అయ్యారు. 2017 లో కాంగ్రెస్ ను వదిలి జాన్ వికాస్ పార్టీని స్థాపించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాకపోవడంతో 2019 జూన్‌లో ఎన్సీపీలో చేరారు. అయితే తాజాగా ఎన్సీపీకి కూడా రాజీనామా చేయడం విశేషం.


Tags:    

Similar News