Rajyasabha Polls: గుజరాత్ లో లెక్కింపు ఆలస్యం..మిగిలిన చోట్ల ఫలితాలు ఇవే!

Rajyasabha Polls: గుజరాత్ లో లెక్కింపు ఆలస్యం..మిగిలిన చోట్ల ఫలితాలు ఇవే!
x
Highlights

ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన 19 రాజ్యసభ సీట్లకు గాను బీజేపీ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 3 సీట్లలో రెండు స్థానాలను బీజేపీ, ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకున్నాయి.

ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన 19 రాజ్యసభ సీట్లకు గాను బీజేపీ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 3 సీట్లలో రెండు స్థానాలను బీజేపీ, ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకున్నాయి. బీజేపీ అభ్యర్థులు జ్యోతిరాదిత్య సింధియా, సుమెర్ సింగ్ గెలుపొందారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గెలుపొందారు.

రాజస్థాన్‌లోని 3 సీట్లలో 2 సీట్లు కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకుంది. పార్టీకి చెందిన కెసి వేణుగోపాల్, నీరజ్ డాంగి గెలుపొందారు. బీజేపీ ఇక్కడ ఒక సీటుతో సరిపెట్టుకుంది.. ఆ పార్టీ నాయకుడు రాజేంద్ర గెహ్లాట్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. ఇదిలావుండగా, గుజరాత్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories