ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్

ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్
x
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లోని 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు....

ఆంధ్ర ప్రదేశ్ లోని 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరెస్టు కారణంగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఓటు వేయలేదు. అలాగే మరో టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నందున రాలేకపోయానని చంద్రబాబుకు లేఖ రాశారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఓట్ల లెక్కించనున్నారు. సాయంత్రం 6 గంటలకు రిటర్నింగ్‌ అధికారి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా వై‌సీపీ తరఫున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు పోటీలో ఉండగా టీడీపీ తరఫున వర్ల రామయ్య బరిలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories