బీహార్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

బిహార్ లోని టెల్వాబజార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోయింది.

Siramdasu Nagarjuna
Published on: 28 Dec 2025 10:46 AM IST
బీహార్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
X

పాట్నా: బిహార్ లోని టెల్వాబజార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోయింది. వంతెన పైనుంచి 8 గూడ్స్ వ్యాగిన్లు కిందపడ్డాయి. అసన్‌సోన్ నుంచి సీతామర్హీ వెళ్తుండగా లహాబాన్ - సిముల్‌తలా స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రైళ్లను దారి మళ్లించారు.

అనంతరం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ ప్రకటించారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే.. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని చెప్పారు. రైల్వే పోలీసులు, RPF, సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బీహార్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story